ఈ ఏడాదిలోని చివరి కాలాష్టమి నాడు, ప్రత్యంగిరా మరియు బగళాముఖీ దేవీల సంయుక్త అనుగ్రహాన్ని ఆహ్వానించండి, ప్రతికూలతను తొలగించుకోండి ✨🛡️
36 మంది అనుభవజ్ఞులైన బ్రాహ్మణులు నిర్వహించే పవిత్ర పూజలో పాల్గొని దైవిక ఆశీర్వాదాలు, రక్షణ పొందండి! ✨🙏
కాలాష్టమి అనేది ప్రతికూలతను నాశనం చేసి, దైవ రక్షణను అందించే శక్తివంతమైన తిథి. ఈ రోజున నిర్వహించే పూజలు చేతబడి, దుష్ట శక్తులు, మరియు రహస్య శత్రువులను సమర్థవంతంగా తటస్థీకరించగలవని నమ్ముతారు. ఇది సంవత్సరంలోని చివరి కాలాష్టమి కాబట్టి, ఇది చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది గత నెలల యొక్క మిగిలిపోయిన ప్రతికూల శక్తిని తొలగించడానికి సహాయపడుతుంది మరియు రాబోయే సంవత్సరంలోకి శాంతి, భద్రత అలాగె ఆశీస్సులతో ప్రవేశించడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.
ప్రత్యంగిరా దేవి ఆదిశక్తి యొక్క ఒక భీకర, రక్షణ రూపం. నరసింహ స్వామి తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఆయన మూడవ కన్ను నుండి ఆవిడ ఉద్భవించిందని చెబుతారు. శక్తివంతమైన ప్రతికూల శక్తులను, చేతబడులను, దుష్ట శక్తులను తొలగించడంలో ఆ అమ్మవారు ప్రసిద్ధి. ఆవిడ సింహ ముఖ రూపం ధైర్యం, కరుణ మరియు రక్షణకు ప్రతీక. ఆమెను పూజించడం వల్ల ఆధ్యాత్మిక బలం చేకూరుతుందని, భక్తులకు హాని నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.
గ్రంథాల ప్రకారం, దశమహావిద్యలు కూడా దుర్గాదేవి రూపాలే మరియు అవి అన్ని సిద్ధులను (ఆధ్యాత్మిక శక్తులను) ప్రసాదిస్తాయి. దశమహావిద్యలలో, బగళాముఖీ దేవి ఎనిమిదవ దేవత మరియు శత్రువులను ఓడించడానికి, జీవితంలోని పెద్ద సవాళ్లను పరిష్కరించడానికి పూజించబడుతుంది. పురాణం ప్రకారం, మదనుడు అనే రాక్షసుడిని నాశనం చేసే శక్తి ఆదిశక్తికి మాత్రమే ఉందని మహా శివుడు వెల్లడించినపుడు అతడిని సంహరించి ఒకప్పుడు అల్లకల్లోలంతో నిండిన ఈ ప్రపంచాన్ని రక్షించడానికి శ్రీ మహా విష్ణువు తపస్సు ఫలితంగా ఆమె హరిద్ర సరోవరం నుండి ప్రత్యక్షమైంది. అందుకే ఆవిడ విజయం, రక్షణ మరియు సంక్షోభయాలను పరిష్కారించే దేవతగా ప్రసిద్ధి చెందింది.
బగళాముఖీ-ప్రత్యంగిరా కవచ పారాయణం మరియు హోమంలో పవిత్ర శ్లోకాలు ఉంటాయి, ఇవి ప్రత్యంగిరా మరియు బగళాముఖీ దేవీల ఆశీర్వాదాలను ఆహ్వానించి, భక్తులకు బలం, ధైర్యం మరియు అన్ని రకాల ప్రతికూలతలకు వ్యతిరేకంగా రక్షణను ఇస్తాయి. బగళాముఖీ దేవి మూల మంత్రాన్ని 1,25,000 సార్లు జపించడం వల్ల ఆవిడ దివ్య రక్షణ లభిస్తుందని నమ్ముతారు. భక్తితో ఈ పూజలు చేసినప్పుడు, ఇవి మిమ్మల్ని చేతబడి, దుష్ట బుద్ధి మరియు రహస్య శత్రువుల నుండి రక్షిస్తాయని, అదే సమయంలో జీవితంలో శాంతి మరియు సమతుల్యతను పునరుద్ధరిస్తాయని చెబుతారు.
శుభప్రదమైన కాలాష్టమి నాడు, ఈ దివ్య శక్తులను ప్రసన్నం చేయడానికి , శ్రీ మందిర్ పూజ సేవ హరిద్వార్లోని సిద్ధపీఠ్ మా బగళాముఖీ ఆలయంలో 36 మంది వేద పండిత బ్రాహ్మణుల చేత ఈ శక్తివంతమైన కర్మలను నిర్వహిస్తోంది. ఈ అరుదైన మహావిద్యా పూజలలో పాల్గొని, దుష్ట శక్తులు మరియు ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకోడానికి దేవీల ఆశీర్వాదాలను పొందండి.